English | Telugu

ఐ డోంట్ కేర్ ఎన్టీఆర్..బాలకృష్ణ ఘాటు వ్యాఖ్య!


తెలుగు సినీ పరిశ్రమలో ఎంత మంది హీరోలు ఉన్న నందమూరి నట సింహం బాలకృష కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఏ విషయాన్నీ అయినా నాన్చకుండా అవతలి వారికి అర్ధమయ్యేలా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం బాలయ్య స్టైల్. అందుకే బాలయ్యకి అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం అటు సినిమాల్లోనూ,ఇటు రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన ఒక వ్యాఖ్య నందమూరి అభిమానులతో పాటు సినీ రాజకియ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది.

గత కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ అందరు గమనించాలసిన విషయం ఏంటంటే తెలుగు దేశం పార్టీ వ్యవపాస్థాపకుడు కీర్తి శేషులు నందమూరి తారకరామారావు సినిమా పరిశ్రమ నుంచే వెళ్లి తెలుగు దేశం పార్టీని స్థాపించారు.ఆ నాటి నుంచే సినీ రంగానికి తెలుగుదేశం పార్టీ కి ఎంతగానో విడదీయరాని అనుబంధం ఉంది. ఎంతో మంది సినిమా వాళ్ళు తెలుగు దేశం పార్టీ తరుపున రాజకీయపరమైన పదవులని సైతం పొందారు. ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. అలాగే ఇక్కడో ఇంకో విషయం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెద్దాయన అభిమానులు అంటే నందమూరి తారక రామారావు అభిమానులు ఆయన్ని ఎంతగా అభిమానిస్తారో అంతే అభిమానంతో బాలకృష్ణని అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా అభిమానిస్తారు. ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే బాలకృష్ణ ని తాజాగా కొంత మంది విలేకర్లు చంద్రబాబు గారి అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందించకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించకపోవడం పై కూడా మీ స్పందన ఏంటి అని అడిగితే బాలయ్య వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా ఐ డోంట్ కేర్ అని అన్నాడు. బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో హీట్ ని రాజేస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.