English | Telugu

గుంటూరు కారం.. థియేటర్లు తగలబడిపోతాయి!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై ఎస్. రాధా కృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగల్ ని ఈ దసరా లోపు విడుదల చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు పాటల రికార్డింగ్ పూర్తయిందని, పాటలు అదిరిపోయాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం 'గుంటూరు కారం' సాంగ్ గురించి అదిరిపోయే న్యూస్ చెప్పాడు.

చినబాబు కుమార్తె హారిక సూర్యదేవర, అక్టోబర్ 6 విడుదల కానున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'తో నిర్మాతగా పరిచయమవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం జరగగా.. సిద్ధు గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. "చినబాబు గారు ఈరోజు మధ్యాహ్నం ఒక విషయం చెప్పారు. అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఇవాళ గుంటూరు కారం సాంగ్ షూట్ నుంచి వచ్చారంట. చినబాబు గారి గొంతులో నేను అంత ఎక్సైట్ మెంట్ చాలారోజుల తర్వాత విన్నాను. సాంగ్ సూపర్ వచ్చింది, థియేటర్లు తగలబడిపోతాయి అన్నారాయన" అని సిద్ధు చెప్పుకొచ్చాడు. సిద్ధు మాటలతో ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.