English | Telugu

రీ రిలీజ్‌లోనూ ‘బాహుబలి’దే రికార్డు.. ఎంత కలెక్ట్‌ చేసిందంటే?

ఇటీవలికాలంలో స్టార్‌ హీరోల సినిమాలను రీరిలీజ్‌ చెయ్యడం మనం చూస్తున్నాం. కొన్ని సినిమాలు రీరిలీజ్‌లోనూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఆ కోవలోనే ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి1’, ‘బాహుబలి2’ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. 2015లో విడుదలైన బాహుబలి1 600 కోట్లు కలెక్ట్‌ చెయ్యగా, 2017లో రిలీజ్‌ అయిన బాహుబలి2 1800 కోట్లు కలెక్ట్‌ చేసి ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

బాహుబలి సిరీస్‌ను ఎడిట్‌ చేసి ‘బాహుబలి ది ఎపిక్‌’ పేరుతో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. కొత్త సినిమాలను కూడా దాటుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది. అక్టోబర్‌ 31న విడుదలైన ‘బాహుబలి ది ఎపిక్‌’ చిత్రం ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది.

ఇక కలెక్షన్స్‌ విషయానికి వస్తే.. ‘బాహుబలి ది ఎపిక్‌’కి కూడా రెగ్యులర్‌ సినిమాల్లాగే ప్రమోషన్స్‌ చేశారు. దీంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ లభించాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. రీరిలీజ్‌లో ఇంత మొత్తం కలెక్షన్స్‌ రావడం ఒక రికార్డుగానే చెప్పాలి. ఇప్పటివరకు ఏ సినిమాకీ రీరిలీజ్‌లో ఈ స్థాయి కలెక్షన్స్‌ రాలేదు. ఇక ఏరియా వైజ్‌గా ఈ కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిపి 9 కోట్ల 80 లక్షలు, హిందీలో 8 కోట్ల 45 లక్షలు, ఓవర్సీస్‌లో 12 కోట్లు కలెక్ట్‌ చేసింది. మొత్తానికి రీరిలీజ్‌లోనూ తన సత్తా ఏమిటో చూపించింది బాహుబలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.