English | Telugu

ఓటీటీలో 'బేబీ' సందడి!

ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం 'బేబీ'. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14 న విడుదలై యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

'బేబీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా దక్కించుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా ప్రకటించింది. "ఆహా అంటే అందరికీ ఇష్టం.. రేపు బేబీ మూవీ అప్డేట్ ఇస్తాం" అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంటే 'బేబీ' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ రానుంది. అయితే ఈ సినిమా ఆగస్టు 24 లేదా 25 నుంచి ఓటీటీ అందుబాటులోకి రానుందని సమాచారం.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించగా.. ఎం.ఎన్. బాలిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, విప్లవ్ ఎడిటర్ గా వ్యవహరించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.