English | Telugu

మెగా156 దర్శకుడి గౌరవ దర్శకత్వంతో ప్రారంభమైన అశ్విన్ బాబు సినిమా

హిడింబ సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్విన్ బాబు ఇప్పుడు తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. అశ్విన్ సరసన దిగంగనాసూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చలన చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథ మహారథులంతా హాజరవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా టాక్ అఫ్ ది ఫిలిం న్యూస్ గా మారింది.

మెగాస్టార్ 156వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నవశిష్ట మల్లిడి అశ్విన్ నూతన చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించాడు. అలాగే నాంది లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల క్లాప్ ని ఇవ్వగా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్ఛాన్ చేసాడు. ఓంకార్ సినిమా స్కిప్ట్ ని అందచేయడంతో పాటు ప్రముఖ అగ్ర నిర్మాతలైన ఠాగూర్ మధు, సుధాకర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.

గంగఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ హిడింబ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత అశ్విన్ బాబు మా సంస్థలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే మా సినిమా సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా అని కూడా ఆయన అన్నారు.

అప్సర్దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతుంది.హైపర్ ఆది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా దాశరధి శివేంద్ర కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నారు. వికాస్ బడిస సంగీతాన్ని అందిస్తున్నాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.