English | Telugu

Anushka: 'మెగా 156' నుంచి అనుష్క అవుట్.. తన 50వ సినిమా ఏంటో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ 

లేడీ సూపర్ స్టార్ అనుష్కకి ఉన్న ఇమేజ్ అండ్ మార్కెట్ మీడియమ్ రేంజ్ యంగ్ స్టార్ హీరోలకి కూడా ఉండదు. అనుష్క పోస్టర్ పైన కనిపించగానే టికెట్స్ సెంటర్ తో సంబంధం లేకుండా తెగుతాయి. ఆ రేంజ్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న అనుష్క... ఇటివలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది. బాగా గ్యాప్ తీసుకోని సినిమాలు చేస్తున్న అనుష్క, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తుంది అనే న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా వశిష్టతో చేస్తున్నాడు. ముల్లోకాల చుట్టూ తిరిగే ఫాంటసీ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఇటివలే మ్యూజిక్ సిట్టింగ్ తో ఈ సినిమా పనులు స్టార్ట్ అయ్యాయి. విశ్వంభర అనే టైటిల్ ని ఈ సినిమాకి లాక్ చేసినట్లు సమాచారం. విశ్వంభర సినిమాలోనే చిరు పక్కన అనుష్క హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజమేనేమో అనుకునే లోపు... అనుష్క, చిరు సినిమాలో నటించట్లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అనుష్క తన 50వ సినిమాని ప్లాన్ చేస్తోందట. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ భాగమతి 2 అయ్యే అవకాశం ఉందని సమాచారం. అనుష్క గతంలో భాగమతి సినిమా చేసింది, ఆమె కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ కి ఫ్లాష్ ఉందంటూ హింట్ ఇచ్చారు. అక్కడి నుంచే సీక్వెల్ ప్లాన్ చేస్తూ భాగమతి 2కి యువీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అనుష్క నుంచి మరో సాలిడ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా పడినట్లే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.