English | Telugu

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ.. గ్రేట్ కాంబో రిపీట్!

టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ ఫుల్ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఇటీవల నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన 'భగవంత్ కేసరి'తో ఆయన మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న రావిపూడి.. తన గత చిత్రాలకు భిన్నంగా 'భగవంత్ కేసరి'లో అద్భుతమైన ఎమోషన్స్ పండించి సాలిడ్ హిట్ కొట్టారు. దీంతో అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారు? ఎలాంటి సినిమా చేయబోతున్నారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

రావిపూడి తన నెక్స్ట్ మూవీని మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కలయికలో 'రాజా ది గ్రేట్' అనే విజయవంతమైన చిత్రం వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా.. 2017 అక్టోబర్ 18న విడుదలై రవితేజ కెరీర్ లో టాప్ గ్రాసర్ గా నిలిచింది.

కొందరు చూపు లేకపోయినా మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తి హీరో అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో పుట్టిన కథే రాజా ది గ్రేట్. బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ ని తీసుకొని కూడా ఎవరినీ నొప్పించకుండా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ని అందించవచ్చని ఈ సినిమాతో రావిపూడి నిరూపించారు. రవితేజ కెరీర్ లో రిపీటెడ్ గా చూడదగ్గ కామెడీ ఎంటర్టైనర్స్ లో ఒకటిగా 'రాజా ది గ్రేట్' పేరు తెచ్చుకుంది. అలాంటి కాంబినేషన్ లో ఇప్పుడు మరో రాబోతున్నట్లు సమాచారం. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని వినికిడి.

రవితేజ-రావిపూడి కాంబోలో రూపొందనున్న రెండో సినిమాని కూడా దిల్ రాజే నిర్మించనున్నారట. ఇప్పటిదాకా అనిల్ డైరెక్ట్ చేసిన మెజారిటీ సినిమాలకు దిల్ రాజే నిర్మాత కావడం విశేషం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.