English | Telugu

తిరుపతి ఈవెంట్‌లో 'ఆదిపురుష్' రెండో ట్రైలర్!

శ్రీరామునిగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణాసురునిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ ఇదివరకు అజయ్ దేవ్‌గణ్ టైటిల్ రోల్ పోషించగా బ్లాక్‌బస్టర్ హిట్టయిన 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్' మూవీతో వెలుగులోకి వచ్చాడు. 'ఆదిపురుష్‌'కు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్, 'జై శ్రీరాం' పాట.. సినిమాపై చెప్పుకోదగ్గ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి.

ఈనెల 6న తిరుపతి పుణ్యక్షేత్రంలో 'ఆదిపురుష్' ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేదికపై మూవీ రెండో ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. దీనిపై నిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటనా ఇంతదాకా రాలేదు.

ప్రస్తుత అంచనాల ప్రకారం 'ఆదిపురుష్' ఓపెనింగ్స్ అసాధారణ స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. తెలుగు, హిందీ వెర్షన్లు భారీ వసూళ్లు సాధిస్తాయని వారు నమ్ముతున్నారు. రాముని రూపంలో ప్రభాస్ కనిపిస్తున్న తీరు అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. లక్ష్మణునిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవ్‌దత్ నాగే నటించిన ఈ సినిమాని ట్-సిరీస్ ఫిలిమ్స్, రెట్రోఫిలిస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.