English | Telugu

లోకేష్‌ సినిమాలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టిన బ్రహ్మాజీ!

సినిమాల్లో నటించాలని.. డబ్బు, పేరు సంపాదించుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. దానికోసం విశ్వప్రయత్నం చేస్తుంటారు. వారి బలహీనతను అదునుగా తీసుకొని కొందరు మోసగాళ్ళు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ స్కామ్‌ను నటుడు బ్రహ్మాజీ బయటపెట్టాడు. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలని ట్వీట్‌ చేశారు.

అసలు విషయం ఏమిటంటే.. తాము స్టార్‌ డైరెక్టర్ల దగ్గర పనిచేస్తున్నామని యువ నటులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ డబ్బు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు బ్రహ్మాజీ.

బ్రహ్మాజీ వేసిన ట్వీట్‌ సారాంశమిది... ‘నటరాజ్‌ అన్నాదొరై అనే వ్యక్తి.. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ మేనేజర్‌ని అంటూ పరిచయం చేసుకొని నటనపై ఆసక్తి ఉన్న యువతీ యువకులకు మెసేజ్‌లు పెడుతూ ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. లోకేష్‌ కనకరాజ్‌ లేటెస్ట్‌ మూవీకి మీ ప్రొఫైల్‌ ఎంపికైందని నమ్మబలుకుతున్నారు. ఆడిషన్‌కి రావాలంటే తనకు కొంత డబ్బు పంపాలని, వాటితో అవసరమైన కాస్ట్యూమ్స్‌ రెంట్‌కి తీసుకొస్తానని, ఆడిషన్‌ పూర్తయిన వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నాడు. ఇతనితోపాటు సత్యదేవ్‌ అనే మరో వ్యక్తి తాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ జర్నలిస్టునని నమ్మించి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వారి మాయలో పడి మోసపోవద్దు అని మనవి చేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ వేసారు. దానితోపాటు నటరాజ్‌ ఫోన్‌ నంబర్‌ కూడా మెన్షన్‌ చేశాడు బ్రహ్మాజీ.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.