English | Telugu

వేటూరి రాసిందొకటి.. ఉదిత్‌ పాడింది మరొకటి.. అయినా పెద్ద హిట్‌!

వైజయంతి మూవీస్‌ అంటే టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడక్షన్‌ సంస్థ. చిరంజీవి కాంబినేషన్‌లో ఈ సంస్థ అధినేత సి.అశ్వనీదత్‌ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అందులో చూడాలని వుంది ఒకటి. ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్‌ మూవీ. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. బోనీకపూర్‌ వల్ల ఈ సినిమాను హిందీలో నిర్మించాలని అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌ నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అనిల్‌కపూర్‌కు, గుణశేఖర్‌కు సెట్‌ అవ్వక పోవడంతో సినిమా ఆగిపోయింది. దానివల్ల అల్లు అరవింద్‌, తను చెరో ఆరు కోట్లు నష్టపోయామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అశ్వనీదత్‌.
ఈ సినిమాలో ఎంతో పెద్ద హిట్‌ అయిన ‘రామ్మా.. చిలకమ్మా’ పాట వెనుక కూడా ఓ కథ ఉంది. వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ పాటను ఉదిత్‌ నారాయణ్‌, స్వర్ణలత ఆలపించారు. అయితే వేటూరి ‘రామా చిలకమ్మా..’ అని రాస్తే.. సింగర్‌ ఉదిత్‌ నారాయణ్‌ దాన్ని ‘రామ్మా చిలకమ్మా’గా పాడారు. సౌండిరగ్‌ బాగుండడంతో దాన్ని అలానే ఉంచేశారు. అదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.