English | Telugu

'జిందగీ ఇన్ టూ షేడ్స్' డాక్యుమెంటరీపై తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ప్రశంసలు!

"ఇఫ్తేకర్ షరీఫ్" జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్” హైదరాబాద్‌లో ప్రీమియర్‌ అయింది. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి, అతిథుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ భారత క్రికెటర్, తెలంగాణ మైనారిటీ వ్యవహారాల మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ సినిమా చూసి ప్రశంసించారు. నిజ జీవిత కథను చాలా నిజాయితీగా, సింపుల్‌గా చూపించారని, ఇందులో మంచి సామాజిక సందేశం ఉందని అన్నారు. డాలి టోమర్ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరారు. ఫిల్మ్ మేకర్ గా ఆమెకు ఉజ్వల భవిష్యత్ ఉందని కొనియాడారు.

ఈ డాక్యుమెంటరీని ముంబయికి చెందిన ఓమ్‌షీల్ ప్రొడక్షన్స్ (డాలీ టోమర్) నిర్మించగా, అమెరికాలోని డీకే ఒమ్‌షీల్ ప్రొడక్షన్స్ (ఖుర్రం సయ్యద్) సహకరించింది. సినిమాకు దర్శకత్వం రజనీష్ దూబే, నిర్మాణం కల్పనా రాజ్‌పుత్, ఎడిటింగ్ దేవు నామ్‌దేవ్ చేశారు.

“జిందగీ ఇన్ టూ షేడ్స్” మన జీవితాల్లో ఎదురయ్యే నిజాల్ని సూటిగా చూపించే డాక్యుమెంటరీ. ఇప్పటికే ఇది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఈ ఈవెంట్ ను కోఆర్డినేట్ చేశారు.

మొత్తానికి, మంచి కంటెంట్‌తో, మంచి సందేశంతో “జిందగీ ఇన్ టూ షేడ్స్” ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకుంటోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.