English | Telugu

రెండో పెళ్లి కూడా పెటాకులేనా! పాపం ఆ డైరెక్టర్!

-విడాకులు నిజమేనా!
-అసలు ఏం జరుగుతుంది
- ఆ ఇద్దరు క్లారిటీ ఇస్తారా!

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల గురించి చెప్పుకుంటే అందులో ఖచ్చితంగా 'సెల్వ రాఘవన్'(Selvaraghavan)ఉంటాడు. 7 /జి బృందావన కాలనీ, యుగానికి ఒక్కడు, ఆడవారి మాటలకి అర్దాలు వేరులే, మయక్కం ఎన్నా, నెంజమ్ మరప్పతిల్లై వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రతిభావంతమైన నటుల గురించి చెప్పుకోవాలన్నా అందులో సెల్వ రాఘవన్ పేరు ఉంటుంది. బీస్ట్, సాని కాయిధ‌మ్, నానే వరువేన్, బకాసురన్, మార్క్ ఆంటోనీ, రాయన్ తో పాటు రీసెంట్ గా వచ్చిన ఆర్యన్ వంటి చిత్రాలే ఉదాహరణ.


సెల్వ రాఘవన్ 2011 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకురాలు 'గీతాంజలి'(Gitanjali)ని వివాహం చేసుకున్నాడు. సెల్వ రాఘవన్ కి ఇది రెండో వివాహం. మొదటి వివాహం ప్రముఖ హీరోయిన్ 7 /జి బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్(Sonia Agarwal)తో జరిగింది. ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. 2006లో వీరి పెళ్లి జరగగా మనస్పర్థలు తలెత్తడంతో 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతనే గీతాంజలి ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ ఒకటి తమిళ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also read: సుజిత్ కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్.. ఎన్ని కోట్లో తెలుసా

ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం గీతాంజలి ఇనిస్టాగ్రమ్ లో భర్తతో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేయడమే. పెళ్లయిన 14 ఏళ్లకి అలా ఉన్నట్లుండి పిక్స్ డిలేట్ చేయడంతోనే ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మాటలు వినపడుతున్నాయి. మరి ఈ విషయంపై ఆ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.