English | Telugu

విశ్వక్ సేన్ 'గామి' షూటింగ్ పూర్తి.. రివీల్ చేసిన చాందిని చౌదరి!

ఇటీవల 'మాస్ కా ధమ్కీ' సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ త్వరలో మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న 'గామి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని అందులో హీరోయిన్ గా నటిస్తున్న చాందిని చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న 'గామి' చిత్రానికి విద్యాధర్ దర్శకుడు. నిజానికి 2021 లోనే ఈ చిత్ర ప్రకటన వచ్చింది. అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఏవో కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. చాలా కాలం పాటు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చింది చాందిని చౌదరి. 'గామి' చిత్రీకరణ పూర్తయిందని ట్వీట్ చేసిన చాందిని.. ఈ అద్భుతమైన చిత్రాన్ని ప్రపంచానికి చూపించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపింది.

షూటింగ్ పూర్తయింది కాబట్టి, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని.. వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. మరి ఈ చిత్రంతో విశ్వక్ సేన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.