English | Telugu

'ఏజెంట్' డిజాస్టర్.. అయినా సురేందర్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తున్న బన్నీ!

సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప-1'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే పుష్ప-2 తర్వాత బన్నీ చేయబోయే సినిమాలు ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించాడు. అలాగే త్వరలో మరో ఇద్దరు దర్శకులతో సినిమాలు ప్రకటించనున్నాడని సమాచారం. అందులో ఒకరు త్రివిక్రమ్ కాగా, మరొకరు సురేందర్ రెడ్డి అని తెలుస్తోంది.

టాలీవుడ్ లో బన్నీ-త్రివిక్రమ్ ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా.. మూడూ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని నమోదు చేసింది. అధికారిక ప్రకటన రానప్పటికీ వీరి కాంబోలో నాలుగో సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'SSMB 28'తో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. ఆ తర్వాత బన్నీతో సినిమా చేయనున్నాడని సమాచారం.

ఇక బన్నీ, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన 'రేసు గుర్రం' కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో మరో సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇటీవల 'ఏజెంట్'తో సురేందర్ రెడ్డి డిజాస్టర్ అందుకోవడంతో బన్నీతో సినిమా అనుమానమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ బన్నీ మాత్రం ఏజెంట్ రిజల్ట్ తో సంబంధం లేకుండా సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి కొంతకాలం క్రితమే ఓ స్టొరీ లైన్ వినిపించగా, అది బన్నీ కి నచ్చిందట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి టీం ఆ స్క్రిప్ట్ పనిలోనే ఉందట. ఫైనల్ స్క్రిప్ట్ నచ్చితే.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో పాటు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని కూడా ఒకేసారి అనౌన్స్ చేయాలని బన్నీ భావిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.