English | Telugu

త్రివిక్రమ్ పట్టుకుంటే కోట్లే..!

టాలీవుడ్‌ మార్కెట్‌ పరిధి ఎంతో అందరికీ తెలిసిందే. రూ.50 కోట్ల మార్కు అందుకుంటే అద్భుతమే అని చెప్పాలి. ఈ ఘనత కూడా అందరు స్టార్‌ హీరోలకూ సాధ్యం కాలేదు. చాలా తక్కువ మంది మాత్రమే కలెక్షన్లలో ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్నారు. ఐతే వరుసగా ఒకటికి రెండు సినిమాలు రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడమంటే చిన్న విషయం కాదు. టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఇంతకుముందు ఆయన నుండి వచ్చిన అత్తారింటికి దారేది అంచనాల్ని మించిపోయి ఆడి రూ.80 కోట్ల దాకా వసూలు చేసింది. ఇప్పుడు మళ్ళీ సన్నాఫ్‌ సత్యమూర్తి రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరింది. అత్తారింటికి దారేది సూపర్ టాక్ వచ్చింది కాబట్టి ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టడం విశేషమేమీ కాదు. కానీ సన్నాఫ్‌ సత్యమూర్తి డివైడ్‌ టాక్‌ను తట్టుకుని 50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం గొప్ప విషయమే. దీంతో వరుసగా రెండు రూ.50 కోట్ల సినిమాలిచ్చిన దర్శకుడుగా త్రివిక్రమ్ రికార్డ్ సృష్టించాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.