English | Telugu

2015లో అయినా నిర్మాతలు బాగుండాలి!!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరో సినిమా చూసిన భారీ బడ్జెట్ తో వుంటుంది. యంగ్ హీరోలైన సరే ఒక్క సినిమా హిట్టైతే తరువాత సినిమా రెండింతల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. మరి ఇంత బడ్జెట్ పెట్టిన సినిమా కచ్చితంగా హిట్ అవుతుందా.. అంటే చెప్పడం కష్టం! ఒక్కప్పుడు దర్శకనిర్మాతలు మొదట సినిమా స్టోరీని రెడీ చేసుకొని చివరకు హీరోహీరోయిన్ల సెలక్షన్ చేసేవారు. ఆ స్ర్కీప్టుకు అనుగుణంగానే హీరోగాని ఇతర నటులు గానీ నటించాల్సి ఉంటుంది. దీనిలో దర్శకుడే కింగ్ మేకర్. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరో కోసమే దర్శకులు స్ర్కీప్టు రెడీ చేసుకుంటున్నారు. దానిలోనూ సినిమా బడ్జెట్ రూ.40కోట్లకు తగ్గకుండా ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ లో సగం వరకు హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్ కే వెళ్తుండడం విశేషం. దీంతో భారీ ఖర్చు పెట్టి సినిమా తీస్తే, అది కాస్త థియేటర్లలో మొదటి రోజే బోల్తా కొట్టి నిర్మాతలను నట్టెట్ట ముంచుతున్నాయి. ఇలాంటి సినిమాలు 2014 సంవత్సరంలో అధికంగానే వచ్చాయి. అయితే వాటి వాళ్ళ హీరోలకు మాత్రం ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే వారికి చేరాల్సిన రెమ్యూనరేషన్ ముందే చేరుతుంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధంతో లేకుండా దర్శకుడితో సహా అందరి వాటా చేరుతుంది. ఒక్క నిర్మాతకి తప్ప.

ఇందులో మిగతా వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన నిర్మాతలు స్టార్ హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప, కథ, కొత్తదనం, వైవిధ్యం పైన దృష్టి పెట్టడంలేదు. అయితే సినిమాలు తీసేది కేవలం హీరోల ఇమేజ్ కోసమేనా? అని సినీ విశ్లేషకులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న వారు పట్టించుకోవడం లేదు. దీంతో నిర్మాతలకు సంవత్సరాలు గడిచేకొద్ది కష్టాలు పెరుతున్నాయే తప్ప తగ్గడంలేదు. సో ఇప్పటికైన నిర్మాతలు తమ పాత ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పలికి, కొత్త సంవత్సరంలో సినీ ప్రేక్షకులకు మంచి కథ, కొత్తదనం, కాసింత మెసేజ్ ను అందించే సినిమాలు తీసి వాళ్ళు లాభాల బాటలో నడిచే ట్రెండ్ ని తీసుకురావాలని కోరుకుందాం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.