English | Telugu

చరిత్ర సృష్టించిన ఓజీ.. పవన్ కళ్యాణ్ రికార్డుల వేట షురూ!

'ఓజీ'తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డుల వేట మొదలైంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. విడుదలకు మూడు వారాల ముందే.. పవర్ స్టార్ తమ బాక్సాఫీస్ పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఆకలితో ఉన్న చిరుతపులిలా రికార్డులను వేటాడుతున్నారు. (Pawan Kalyan)

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఓజీ మూవీ సంచలనాలు సృషిస్తోంది. ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో 1 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకుంది. అంతేకాదు, ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. (They Call Him OG)

పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఆయన స్టార్ డమ్ కి తగ్గ సరైన సినిమా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని తీర్చేలా ఓజీ వస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు ముందే ఓజీ సరికొత్త రికార్డులకు సృష్టిస్తోంది.

ఓజాస్‌ గంభీరగా పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీకి సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటిదాకా ఓజీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానులను ఆకట్టుకుంది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది అంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.