English | Telugu

అనుష్క కోసం రంగంలోకి ప్రభాస్.. నేను ఊరుకోనంటున్నప్రముఖ నటి 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),అనుష్క(Anushka)ఫెయిర్ కి సిల్వర్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. మిర్చి, బాహుబలి సిరీస్ సక్సెస్ లే అందుకు ఉదాహరణ. సినిమాల పరంగా కాకుండా,వ్యక్తిగతంగా కూడా, ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పైగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలని ఇద్దరు ఎక్కడ ఖండించలేదు. దీంతో పెళ్లి న్యూస్ పై మరింతగా చర్చ జరుగుతూనే ఉంది.

అనుష్క టైటిల్ రోల్ ని పోషించిన 'ఘాటి'(Ghaati)రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'ఘాటి' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ గ్లింప్స్ విడుదలైంది. ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న గ్లింప్స్ లో యాక్షన్ సన్నివేశాలు, అనుష్క రౌద్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో 'వాళ్ళు ఊరుకోరు, వీళ్లు ఊరుకోరు అంటే నేను ఊరుకోను' అని అనుష్క చెప్పిన డైలాగ్ అయితే సూపర్ గా ఉంది. ఏ ఉద్దేశ్యంతో 'ఘాటి' తెరకెక్కిందనే విషయాన్నీ కూడా ఆ డైలాగ్ ద్వారా చెప్పించినట్టయ్యింది. ఇక ముందుగా చేసుకున్న ఒప్పంద ప్రకారం ఘాటి ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనడం లేదు. దీంతో ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ గ్లింప్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఘాటి కి విభిన్న దర్శకుడు 'క్రిష్(Krish)జాగర్లమూడి 'దర్శకత్వం వహించాడు ఇంతకు ముందుకు ఈ ఇద్దరి కాంబోలో వేదం వచ్చి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు, జిష్ణు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.