English | Telugu

హాలీవుడ్ కి టబు

2021 లో విడుదలయ్యి సంచలన విజయం సాధించిన హాలీవుడ్ మూవీ డ్యూన్.సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నాలుగువందల ఏడు మిలియన్ల డాలర్స్ ని సంపాదించింది. డ్యూన్ పార్ట్ టూ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సిరీస్ కి వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.

టబు ఇటీవల క్రూ తో మంచి విజయాన్ని దక్కించుకుంది. కరిష్మా కపూర్, కృతి సనన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని తన నటనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపించింది.ఇప్పుడు డ్యూన్ సిరీస్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో మెరవబోతుంది. ఇది ఆమెకి మంచి అవకాశం అని చెప్పవచ్చు.తను ఎలా నటిస్తుందో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుండగా మాక్స్‌లో ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. . ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, మార్క్ స్ట్రాంగ్, జేడ్ అనౌకా, క్రిస్ మాసన్, జోధి మే మరియు జోష్ హ్యూస్టన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు

1982 లో వచ్చిన బజార్ అనే హిందీ చిత్రం ద్వారా టబు సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో మాత్రం 1991 లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ వన్ తో పరిచయం అయ్యింది.నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే, అందరి వాడు లాంటి సినిమాల్లో నటించింది. జాతీయ అవార్డు ని కూడా గెలుచుకున్న టబు ఇప్పటివరకు హిందీ తో పాటు ఇతర భాషల్లో కలుపుకొని సుమారు 50 సినిమాలకి పైగానే చేసింది

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.