English | Telugu

ఓటీటీలోకి మంచి మిడిల్ క్లాస్ మూవీ!

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'షరతులు వర్తిస్తాయి'. ఈ ఏడాది మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

'షరతులు వర్తిస్తాయి' మూవీ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. "మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలని ఉందా? అయితే షరతులు వర్తిస్తాయి" అంటూ తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించింది ఆహా. మే 18 నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

'షరతులు వర్తిస్తాయి' మూవీ రివ్యూ

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.