English | Telugu

పెళ్లైన హీరోయిన్‌తో హీరో సూర్య స‌ర‌సాలు!

డిఫ‌రెంట్ రోల్స్‌, మూవీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో త‌న‌దైన క్రేజ్ సంపాదించుకున్న వెర్స‌టైల్ హీరో సూర్య‌. ప్ర‌తీ సినిమాలోనూ ఆయ‌న ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని చూపించ‌టానికి ఆరాట‌ప‌డుతుంటారు. ఆ దిశ‌గానే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న చిత్రం కంగువా. ఇదొక పీరియాడిక్ మూవీ. దీని త‌ర్వాత ఈయ‌న న‌టించ‌బోయే సినిమాలు చాలానే లైన్‌లో ఉన్నాయి. అందులో ముందుగా లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో మూవీ తెర‌కెక్క‌నుందని మీడియాలో వినిపిస్తోన్న టాక్‌. సూర్య 43గా రూపొంద‌నున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. వివ‌రాల మేర‌కు మేక‌ర్స్ మ‌ల‌యాళీ ముద్దుగు న‌జ్రియా న‌జీమ్‌ను హీరోయిన్‌గా న‌టించాల‌ని సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. మాలీవుడ్ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత న‌జ్రియా చాలా ప‌రిమితంగానే సినిమాల్లో న‌టిస్తుంది. నానితో అంటే సుంద‌రానికీ సినిమాలో ఆమె క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అన్నీ కుదిరితే సూర్య 43లోనూ అల‌రించ‌నుంది. మరి పెళ్లైన మలయాళీ ముద్దుగుమ్మతో సూర్య రొమాన్స్ ఎలా ఉంటుందో మరి.

శూర‌రై పోట్రు (ఆకాశం నీ హ‌ద్దురా) చిత్రం సూర్య‌, సుధా కొంగ‌ర కాంబినేష‌న్‌లో తెర‌కెక్కింది. డైరెక్ట‌ర్‌గా ఓటీటీలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మ‌రోసారి ఈ హిట్ కాంబోలో మూవీ రానుంది. ఇది పూర్తి కాగానే సూర్య‌, వెట్రిమార‌న్ కాంబోలే వాడివాస‌ల్ మూవీ తెర‌కెక్కనుంది. మరో వైపు టాలీవుడ్ డైరెక్టర్ చందు మొండేటి సైతం చతుర్వేదాలపై సినిమాను చేయటానికి సూర్యతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు , బాలీవుడ్‌కి చెందిన రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్ర రీసెంట్‌గా సూర్య‌ను క‌లిసి క‌ర్ణ అనే స‌బ్జెక్ట్‌ను వినిపించారని, మెయిన్ లైన్‌కు ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయ‌మ‌న్నార‌నే న్యూస్ కూడా హల్ చల్ చేస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.