English | Telugu

బాహుబలిని చూసి వాత‌లు పెట్టుకొంటున్న శ్రీ‌మంతుడు

బాహుబ‌లి పుష్క‌రానికి ఒక‌సారి వ‌చ్చే సినిమా. ఈ విష‌యం రాజ‌మౌళి కూడా ఒప్పుకొంటాడు. దాని స్పాన్‌, మార్కెట్ వేరు. ఈ సినిమాకి మీడియా వ‌ద్దంటే ప‌బ్లిసిటీ ఇచ్చింది. పైసా ఖ‌ర్చు పెట్ట‌క‌పోయినా కోట్లాది రూపాయ‌ల విలువ గ‌ల ప్ర‌చారం చేసి పెట్టింది. ప్ర‌తి రోజూ.... బాహుబ‌లి వార్త‌లే ప‌తాక శీర్షిక‌ల్లో సాగేవి. `మాకూ అలానే ప‌బ్లిసిటీ చేసిపెట్ట‌కూడ‌దూ...` అంటూ శ్రీ‌మంతుడు టీమ్ కూడా ఇప్పుడు మీడియాను కోరుతోంద‌ట‌. బాహుబ‌లి అంత కాక‌పోయినా.. మాకూ ఆ రేంజులోనే ప‌బ్లిసిటీ కావాల‌ని అంటున్నార‌ట‌. అంతేకాదు, రోజుకో స్టిల్లు విడుద‌ల‌చేసి, ఇంట‌ర్వ్యూలు పెట్టి హంగామా సృష్టిస్తున్నారు.

ఇప్పుడు బెనిఫిట్ షోల‌లో కూడా బాహుబ‌లి ఫార్ములానే అనుస‌రిస్తున్నార‌ని టాక్‌. శ్రీ‌మంతుడు ఆగ‌స్టు 7న విడుద‌ల కాబోతోంది. అప్పుడే ఈ సినిమా కోసం బెనిఫిట్ షోల హంగామా మొద‌లెట్టేశారు. ఎక్క‌డెక్క‌డ షోలు ప్ర‌ద‌ర్శించాలి, టికెట్లు రేటు ఎంతుండాలి? అనే విష‌యాల‌పై నిర్మాత‌లు అప్పుడే ఓ అభిప్రాయానికి వ‌చ్చేశారు. టికెట్లు రేటు 1500 నుంచి 2500 వ‌ర‌కూ ఉంది. డిమాండ్‌ని బ‌ట్టి రేటు ఫిక్స‌వుతుంద‌న్న‌మాట‌. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లోని కొన్ని ప్ర‌ధాన‌మైన ప్రాంతాల్లో ఈ షోలు ఏర్పాటు చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఓవ‌ర్సీస్ లో మ‌హేష్‌కి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అందుకే అక్క‌డ ఆగ‌స్టు 6నే షోలు వేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యం తీసుకొంది. అంతా బాగానే ఉంది. మ‌రి బెనిఫిట్ షోల వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్ ఏమిటి? సినిమా బాగుంటే ఫ‌ర్వాలేదు. లేదంటే టాక్ ముందే బ‌ట‌య‌కు వ‌చ్చి, ఓపెనింగ్స్‌పై దారుణ‌మైన ప్ర‌భావాన్ని చూపించ‌డం ఖాయం. మ‌హేష్ కూడా భ‌య‌ప‌డుతోంది దాని గురించే. బెనిఫిట్ షోల‌పై అంత దృష్టి పెట్టొద్దు.. లైట్ తీసుకోండి.. అని మ‌హేష్ త‌న నిర్మాత‌ల‌కు సూచించాడ‌ట‌. కానీ.. వాళ్లు మాత్రం వినేట్టు లేరు. బాహుబ‌లి బెనిఫిట్ షోల వ‌ల్ల భారీ ఆదాయం వ‌చ్చింది, మాకూ అంత వ‌స్తుంది క‌దా అని లెక్క‌లు వేస్తున్నార‌ట‌.

బాహుబ‌లికి వ‌చ్చిన హైప్ వేరు. ఆ సినిమాని చూడాల‌ని ప్రేక్ష‌కులు రెండేళ్ల నుంచీ ఎద‌రుచూశారు. అందుకే వాళ్లంతా బెనిఫిట్ షోల‌కు ఎగ‌బ‌డ్డారు.అందుకే బెనిఫిట్ షో రేటు ఎంతున్నా కొనేశారు. అలాగ‌ని శ్రీ‌మంతుడుకీ అదే రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని అనుకొంటే ఎలా..? పులిని చూసి న‌క్క వాత‌పెట్టుకొన్న‌ట్టు ఉండ‌దూ..??

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.