English | Telugu

సమంత నాగ చైతన్య ల బామ్మ మృతి 

సమంత,నాగ చైతన్యలు కలిసి మొదటి సారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నమూవీ ఏ మాయ చేసావే. ఈ మూవీలో సమంత బామ్మగా నటించిన నటిమణి పేరు సుబ్బలక్ష్మి. తెలుగు, తమిళ ,మలయాళ చిత్రాల్లో బామ్మ గా నటించి ఎంతో మందిని తన నటనతో ఆకట్టుకుంది. తాజాగా ఆమె కి సంబంచిన ఒక వార్త దక్షిణ భారతీయ చిత్ర సీమని విషాదంలో ముంచెత్తుతుంది.

సుబ్బలక్ష్మి గారు నిన్న కొచ్చి లో పరమపదించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటు తుదిశ్వాస విడిచారు. ఆమె మరణించిన విషయాన్ని సుబ్బలక్ష్మి గారి మనవరాలు సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. దీంతో పలు భాషలకి చెందిన చిత్ర ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు సుబ్బలక్ష్మి గారి భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

తన సినీ కెరీర్లో సుమారు 70 చిత్రాల వరకు నటించిన సుబ్బలక్ష్మి గారు సినీ పరిశ్రమలోకి రాక ముందు జవహర్ బాలభవన్ లో ఎంతో మందికి సంగీతం నాట్య రంగాల్లో శిక్షణ ని ఇచ్చారు. అలాగే దక్షిణ భారతదేశం మొత్తంలోనే ఆల్ ఇండియా రేడియోలో పని చేసిన మొదటి లేడీ కంపోజర్ గా ఆమె కీర్తిని గడించారు. అలాగే ఎన్నో చిత్రాల్లోని పాత్రలకి తన గళాన్ని అందించారు. ఆమె వయసు ప్రస్తుతం 87 సంవత్సరాలు. మళయాళంలో మమ్ముట్టి ,మోహన్ లాల్ తో కలిసి చాలా సినిమాల్లో నటించిన సుబ్బలక్ష్మి గారి చివరి మూవీ దళపతి విజయ్ హీరోగా వచ్చిన బీస్ట్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.