English | Telugu

టాలీవుడ్ టాప్ హీరోతో రవీనా టాండన్ కూతురు రొమాన్స్..


తొంభయ్యవ దశకం లో భారతీయ చిత్ర పరిశ్రమని తమ అందంతో ఊపేసిన అతి కొద్ది మంది నటీమణుల్లో రవీనాటాండన్ కూడా ఒకరు. అక్షయ్ కుమార్ తో టిప్ టిప్ బర్సా పానీ అని ఆడి పాడినా బాలకృష తో స్వాతిలో ముత్యమంతా అని ఆడి పాడినా అది రవీనా టాండన్ కే చెల్లింది. ఆ రోజుల్లో కుర్రకారు మొత్తం రవీనా అందానికి ఫిదా అయినా వాళ్లే. ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 లో ప్రధాన మంత్రి పాత్రలో పవర్ ఫుల్ గా నటించి ప్రేక్షకులందర్నీ తన అద్భుతమైన నటనతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇప్పడు రవీనా పెద్ద కూతురు తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ఒక అగ్ర హీరో సరసన హీరోయిన్ గా చెయ్యబోతుందనే వార్త సంచలనం సృష్టిస్తుంది.

తెలుగు సినీ పరిశ్రమకి బాలీవుడ్ నుంచి ఎంతో మంది ముద్దుగుమ్మలు పరిచయమయ్యి టాలీవుడ్ లో తమ హవా ని కొనసాగించారు.లేటెస్ట్ గా శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది .ఇప్పుడు తాజాగా రవీనా కూతరు రాషా థడానీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంటర్ అవ్వబోతుంది. పైగా తాను ఎంట్రీ ఇవ్వబోతుంది మామూలు హీరో సరసన కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా రాషా గ్రాండ్ గా లాండ్ అవ్వడానికి రెడీ అవుతుంది.
రామ్ చరణ్ హీరో గా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ సాన బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక కొత్త మూవీ ప్రారంభం కాబోతుందనే విషయం అందరికి విదితమే. సుమారు 300 కోట్ల వ్యయంతో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలోనే రాషా థడానీ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు ఈ వార్త భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేస్తుంది.తన మొదటి సినిమా తోనే రామ్ చరణ్ లాంటి స్టార్ తో నటించే అవకాశం పొందినందుకు రాషా చాలా అదృష్టవంతురాలని అంటున్నారు.ఇక రామ్ చరణ్ పక్కన రవీనా కూతురు రాషా నటిస్తుందనే వార్తలతో మెగా అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే రాషా పిక్స్ ని చూసి రాషా తల్లిని మించిన అందగత్తె అనే ప్రశంసల్ని కురిపిస్తున్నారు.అలాగే రాషా ఫ్యూచర్లో తెలుగు సినిమా అగ్ర హీరోయిన్ అయినా కూడా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.