English | Telugu

రిష‌బ్‌కి ర‌క్షిత్ విషెస్‌.. 'కిరిక్ పార్టీ' సీక్వెల్ సంగ‌తేంటి?

డివైన్ బ్లాక్ బస్ట‌ర్ మూవీ 'కాంతార‌'తో నేష‌న‌ల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు రిష‌బ్ శెట్టి. ఆయన పుట్టినరోజు ఇవాళ. కాంతారా సక్సెస్ తర్వాత ఇండస్ట్రీలో ఆయన జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇది. రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ స్పెషల్ అకేషన్ ని పురస్కరించుకొని రిషబ్ శెట్టికి త‌న‌ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి కూడా విషెస్ చెప్పారు. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు రిష‌బ్‌. ఆ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ తెచ్చుకోవడం తోపాటు, ప్రేక్షకుల మనసులు కూడా కొల్లగొట్టింది. కర్ణాటకలోని కొన్నిచోట్ల ఓ వర్గం ఆచరిస్తున్న ఆచారాలను గురించి చెప్పిన సినిమా అది. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న వారి జీవన విధానాన్ని కూడా కళ్ళకు కట్టిన చిత్రం.

అదే సందర్భంలో రక్షిత్ శెట్టి తెర‌కెక్కించిన‌ '777 చార్లీ' కూడా అంతే పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఓ వ్యక్తికి ఓ కుక్కకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని వ్యక్తం చేస్తూ చార్లీ తెర‌కెక్కించారు. ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ వైపు యావత్ భారతం చూపు తిరిగేలా చేశాయి.

ర‌క్షిత్‌శెట్టి విష్ చేస్తూ "అద్భుతమైన ఏడాది కావాలి. అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గాలి. ఎన్నెన్నో విజయాలు అందుకోవాలి. ఆనందంగా ఉండాలి" అని ఆకాంక్షించారు. రక్షిత్ శెట్టి విషెస్ చూసిన వారందరూ వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'కిరాక్ పార్టీ' చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 'కిరాక్ పార్టీ' సీక్వెల్ కూడా తీస్తే బాగుంటుందని మెసేజ్లు పోస్ట్ చేస్తున్నారు అభిమానులు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కిరాక్ పార్టీతోనే రష్మిక మందన్న హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ, అది పెళ్లి పీటల వరకు వెళ్లడం, బ్రేక‌ప్ కావ‌డం తెలిసిందే. ఇప్పుడు కిరాక్ పార్టీ సీక్వెల్‌ ఉంటే అందులో రష్మిక ఉంటారా లేదా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.