English | Telugu

కొత్త లుక్‌‌లో రజనీకాంత్!

క్లౌడ్ నైన్ అనే ప‌దానికి సిస‌లైన అర్థం ఇదేనా అంటున్నారు ర‌జ‌నీకాంత్‌. ఆయ‌న హీరోగా న‌టించిన జైల‌ర్ ఇచ్చిన స‌క్సెస్ అలాంటిది మ‌రి. త‌న సినిమాల రిలీజ్ త‌ర్వాత హిమాల‌యాల‌కు వెళ్లే ర‌జ‌నీ, ఈ సారి జైల‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ వెళ్లారు. ఆధ్యాత్మిక ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సూప‌ర్‌స్టార్‌. దాదాపు 400 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది జైల‌ర్ మూవీ. నెల్స‌న్ దిలీప్‌కుమార్ త‌న స్టామినాను ఇంకో సారి ప్రూవ్ చేసుకున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ త‌న మీద పెట్టిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నారు. అదే విష‌యాన్ని ర‌జ‌నీకాంత్ కూడా ఆనందంగా పంచుకున్నారు. క‌మ‌ల్‌హాస‌న్‌తో స‌హా ఎంతో మంది జైల‌ర్ విజ‌యం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
ఈ సినిమా పూర్తి కాగానే కుమార్తె ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వంలో లాల్ స‌లామ్ సినిమా చేశారు ర‌జ‌నీకాంత్‌. ఇందులోనే జీవిత సూప‌ర్‌స్టార్‌కి చెల్లెలిగా న‌టిస్తున్నారు.

హిమాల‌యాల‌కు వెళ్లిన ర‌జ‌నీ శుక్ర‌వారం చెన్నైకి రిట‌ర్న్ అయ్యారు. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో త‌లైవ‌ర్ 170వ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. సెప్టెంబ‌ర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ చెన్నైలో జ‌ర‌గ‌నుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తారు. ఈ సినిమా కోస‌మే ఓ రోల్ చేయ‌మ‌ని నానిని అడిగార‌ట‌. అయితే నాని సున్నితంగా నో చెప్పిన‌ట్టు టాక్‌. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఫాహ‌ద్ ఫాజిల్‌, మంజు వారియ‌ర్‌, శ‌ర్వానంద్ కీ రోల్స్ కి సైన్ చేశారు. రిటైర్డ్ కాప్ గురించిన క‌థ ఇది. ఎన్కౌంట‌ర్ క‌ల్చ‌ర్‌ని వ్య‌తిరేకించిన రిటైర్డ్ కాప్‌గా క‌నిపిస్తార‌ట ర‌జ‌నీ. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో త‌లైవర్ కొత్త లుక్‌లో క‌నిపిస్తారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.