English | Telugu

ఖైదీ2 గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్‌!

లోకేష్ క‌న‌గ‌రాజ్ నెక్స్ట్ సినిమా లియో. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, సంజ‌య్‌ద‌త్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు దాదాపు 400 కోట్ల రూపాయ‌ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని టాక్‌. దీంతో లోకేష్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ త‌లైవ‌ర్ 171ని డైర‌క్ట్ చేస్తారు. ఈ విష‌యాన్ని లోకేష్ స్వ‌యంగా వెల్ల‌డించారు. అంతే కాదు, ఈ సినిమా త‌ర్వాత అత‌ను ఖైదీ సీక్వెల్ ఖైదీ2ని చేస్తారు. అయితే, కోడంబాక్కం న్యూస్ ప్ర‌కారం ఈ లైన‌ప్‌లో పెద్ద మార్పు క‌నిపిస్తోంది. ఖైదీ2 సినిమా చేయాల్సిన కాల్షీట్ల‌లో లోకేష్ మ‌రో సినిమా చేయ‌డానికి ఫిక్స్ అయ్యార‌ట‌. ఆ సినిమా పేరు రోలెక్స్. సూర్య హీరోగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ తెర‌కెక్కిస్తుంది.

క‌మ‌ల్‌హాసన్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన విక్ర‌మ్ సినిమా క్లైమాక్స్ లో రూత్‌లెస్ విల‌న్‌గా న‌టించారు సూర్య‌. ఆ కేర‌క్ట‌ర్ పేరే రోలెక్స్. ఇప్పుడు ఆ కేర‌క్ట‌ర్ ఆధారంగా ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.రీసెంట్‌గా రోలెక్స్ సినిమా గురించి సూర్య కూడా మెన్ష‌న్ చేశారు. ఈ సినిమా త‌ర్వాత లోకేష్‌తో ఇరుంబు కై మాయావి అనే మూవీ కూడా చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. అయితే, ఖైదీ 2 లేద‌న్న‌ది కార్తి ఫ్యాన్స్ కి మాత్రం చేదు వార్తే. ఎందుకంటే ఆయ‌న్ని ఢిల్లీ రోల్‌లో ఇంకో సారి చూడ‌టానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు ఫ్యాన్స్. అంద‌రికీ తెలిసిన ఈ విష‌యాన్ని లోకేష్ కూడా క‌న్సిడ‌ర్ చేస్తార‌నే టాక్ కూడా ఒక‌టి న‌డుస్తోంది. ఈ సినిమాలో సూర్య‌, కార్తి ఇద్ద‌రూ ఉండేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. రోలెక్స్, ఢిల్లీ కేర‌క్ట‌ర్ల‌ను క‌లిపి లోకేష్ ఓ స్క్రిప్ట్ చేశార‌నే మాట‌లు కూడా న‌డుస్తున్నాయి. 2024 ఆఖ‌రున‌గానీ, 2025 ప్రారంభంలోగానీ, ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.