English | Telugu

'పుష్ప-2' టీమ్ కి బస్సు యాక్సిడెంట్!

'పుష్ప-2' టీమ్ ప్రయాణిస్తున్న బస్సుకి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎవరికీ తీవ్ర గాయాలు కాకుండా, అందరూ క్షేమంగా బయటపడటంతో మూవీ టీమ్ ఊపిరి పీల్చుకుంది. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప-1' పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో భాగం 'పుష్ప -2' రూపొందుతోంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో తాజా షెడ్యూల్ జరిగింది. అల్లు అర్జున్, ఫహాద్‌ ఫాజిల్ సహా పలువురు నటీనటులు పాల్గొన్న ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నిన్నటితో ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో కొందరు ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ ఓ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నార్కట్ పల్లి వద్ద ఈ బస్సు, మరో బస్సు ఢీ కొన్నాయి. అయితే బస్సులు మితిమీరిన వేగంతో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరికి స్వల్ప గాయాలు కావడం తప్ప, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. స్వల్ప గాయాలు తగిలిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారట.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.