English | Telugu

'ఆదిపురుష్'తో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్!

టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్లు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ బిజినెస్ పట్ల వారు ఆసక్తి చూపుతున్నారు. ఓ రకంగా హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ వైపు అడుగులు వేయడానికి కారణం ఏషియన్ సినిమాస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఏషియన్ సంస్థ, మహేష్ బాబుతో కలిసి హైదరాబాద్ లో ఏఎంబీ సినిమాస్, విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీ సినిమాస్ ని ప్రారంభించింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది.

ఒకప్పుడు అమీర్ పేట్ లో సత్యం థియేటర్ కి ఎంతో క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో ఏషియన్ సత్యం మాల్ రాబోతుంది. దానిలోనే 'ఏఏఏ సినిమాస్' అనగా 'ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్' అందుబాటులోకి రానుంది. ఇది ఏఎంబీ మాల్ కి ధీటుగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే దాదాపు నిర్మాణం పూర్తయ్యి, తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇప్పుడు ఈ ఏఏఏ సినిమాస్ ఓపెనింగ్ కి ముహూర్తం ఖారైనట్లు తెలుస్తోంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాతోనే ఏఏఏ సినిమాస్ గ్రాండ్ గా లాంచ్ కానుందని సమాచారం. అంతేకాదు ఈ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరయ్యే అవకాశముంది అంటున్నారు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.