English | Telugu

పూరీ.. సీక్వెల్‌కి సీన్ ఉందా?

అటు ఛార్మి, ఇటు పూరి ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న జ్యోతిల‌క్ష్మి శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఎన్నో అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌కు వెళ్లిన ప్రేక్ష‌కులు చ‌తికిల ప‌డ్డారు. విమ‌ర్శ‌కులు పూరిపై గ‌న్నులు ఎక్కిపెట్టారు. పూరి ఏమాత్రం శ్ర‌ర్థ పెట్ట‌కుండా, స‌గం స‌గం వండిన వంట‌కంలా ఈ సినిమా తీశాడ‌ని ఏకేస్తున్నారు. వ‌సూళ్లూ ఏమాత్రం బాగోలేవు. ఈ సినిమాకి లాభాలు రావ‌డం అటుంచితే, క‌నీసం డ‌బ్బులొస్తాయా అనేది అనుమానంగా మారింది. మొత్తానికి జ్యోతిల‌క్ష్మి ఓ విఫ‌ల ప్ర‌యత్నం. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ జ్యోతిల‌క్ష్మి 2 తీస్తామ‌ని ఎగిరిగంతేసిన పూరి, ఛార్మి, క‌ల్యాణ్‌... ఇక అటు వైపు ఆలోచించ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే సీక్వెల్‌కి స‌రిప‌డా క‌థ కాదిది. సీక్వెల్ ఉద్దేశం ఉంటే క్లైమాక్స్ లో కొన్ని లింకులు వ‌దులుతారు. ఈ సినిమాలో అలాంటివేం జ‌ర‌గ‌లేదు. దానికి తోడు... తొలిభాగం హిట్ట‌యితేనే సీక్వెల్‌కి ప్రాణం వ‌స్తుంది. జ్యోతిల‌క్ష్మికి అంత సీను కూడా లేదాయె. దాంతో.. జ్యోతిల‌క్ష్మి 2 వ‌చ్చే అవ‌కాశాలు లేనట్టే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.