English | Telugu

రాజ‌మౌళికి హ్యాండిచ్చిన నాని

ప్ర‌భాస్ అభిమానులే కాదు, యావ‌త్ తెలుగు చిత్ర‌సీమ మొత్తం బాహుబ‌లి కోసం ఎదురుచూస్తోంది. బాహుబ‌లి ఆడియో విడుద‌ల అంటే.. వాళ్లంద‌రికీ పండ‌గే. ఈ కార్య‌క్ర‌మాన్ని కాస్త ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దాల‌నుకొన్నాడు జక్క‌న్న రాజ‌మౌళి. ఈ కార్య‌క్ర‌మం యాంక‌రింగ్ బాధ్య‌త‌లు నానికి అప్పగించాడు. అయితే నాని చివ‌రి క్ష‌ణాల్లో రాజ‌మౌళికి హ్యాండిచ్చాడు. ఆ ప్లేసులో రెగ్యుల‌ర్ యాంక‌ర్ సుమ వ‌చ్చి చేరింది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి కూడా ట్విట్ట‌ర్లో దృవీక‌రించాడు.

ఇటీవ‌ల 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' సినిమా షూటింగ్‌లో నాని కాలికి గాయ‌మైంద‌ట‌. అందుకే నాని రాలేక‌పోయాడ‌ట‌. దాంతో మరో మార్గం లేక‌.. సుమ‌ని హుటాహుటిన తిరుప‌తి ర‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. ఈరోజు సాయింత్రం 7 గంట‌ల‌కు తిరుప‌తిలోన ఎస్వీ యూనివ‌ర్సిటిలో బాహుబ‌లి ఆడియో కార్యక్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు క‌నీసం ఇర‌వైవేల మంది ప్ర‌భాస్ అభిమానులు త‌ర‌లి వ‌స్తార‌ని అంచ‌నా.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.