English | Telugu

పీయ‌స్‌2... నెల రోజులు ప‌క్కా ప్ర‌మోష‌న్‌!

ఒక‌ప్పుడు సినిమా తీయ‌డం అంటే కాంబినేష‌న్ సెట్ చేసుకోవ‌డం, ప్రీ ప్రొడ‌క్ష‌న్ చేసుకోవ‌డానికే ఎక్కువ టైమ్ ప‌ట్టేది. ఒక్క‌సారి సినిమా ప‌ట్టాలెక్కితే, ఇక అంతా స‌జావుగా సాగిపోతుంద‌ని అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాంబో సెట్టింగ్‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్‌, షూటింగ్ కూడా న‌ల్లేరు మీద న‌డ‌క‌లా జ‌రిగిపోతోంది. కానీ ఆ త‌ర్వాత విష‌యాల మీదే ఎక్కువ‌గా ఫోక‌స్ చేయాల్సి వ‌స్తోంది.మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా పొన్నియిన్ సెల్వ‌న్. ఈ చిత్రం ఫ‌స్ట్ పార్టు షూటింగులో ఉన్న‌ప్పుడే, సెకండ్ పార్టుకు సంబంధించి కూడా మేజ‌ర్ పోర్ష‌న్‌ని తెర‌కెక్కించేశారు డైర‌క్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఫ‌స్ట్ పార్టుకి 500 కోట్ల‌కు పైగా డ‌బ్బులు వ‌సూలు కావ‌డంతో, సెకండ్ పార్టు మీద కాస్త కాన్‌సెన్‌ట్రేష‌న్ పెంచి, కొన్ని అడిష‌న‌ల్ సీన్లు రాసుకుని షూటింగ్ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 28న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

సినిమా రిలీజ్ డేట్‌కి క‌రెక్ట్ గా నెల రోజుల ముందు నుంచే ప్ర‌మోష‌న్లు చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట మ‌ణిరత్నం. మార్చి 28న ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ని అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. సౌత్ స్టేట్స్ తో పాటు నార్త్ స్టేట్స్ లోనూ ఈ సారి గ్రాండ్‌గా ఈవెంట్ల‌ను ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్. ఐశ్వ‌ర్య‌రాయ్‌ని ముందు నిల‌బెట్టి ఈ సినిమాకు నార్త్ లో ఎలివేష‌న్ ఇవ్వాల‌న్న‌ది ప్రైమ‌రీ మేక‌ర్స్ ప్లాన్ అట‌. పొన్నియిన్ సెల్వ‌న్ సెకండ్ పార్టులో ఐశ్వ‌ర్య‌రాయ్ డ్యూయ‌ల్ రోల్స్ లో క‌నిపిస్తారు.

ఫ‌స్ట్ పార్టులో విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, శోభిత ధూళిపాళ‌, త్రిష కీ రోల్స్ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్టులోనూ వీరంద‌రూ కంటిన్యూ అవుతారు.చోళ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగుతుంది పొన్నియిన్ సెల్వ‌న్‌. ఆ దేశ‌పు సిరిసంప‌ద‌లు, రాజ్యంలో జ‌రిగిన కుట్ర‌లు, కుతంత్రాలు, రాచ‌రిక‌పు వ్య‌వ‌స్థ‌, వ‌ర్త‌కం, వ్య‌వ‌సాయం వంటివాట‌న్నిటినీ స‌వివ‌రంగా చూపించ‌డానికి ట్రై చేశారు మ‌ణిర‌త్నం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.