English | Telugu

కిరణ్ అబ్బవరంకి అఖిల్ హ్యాండ్ కలిసొస్తుందా?

కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రం సాంగ్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 18 మహాశివరాత్రికి విడుదల కానుంది. శివరాత్రికి విడుదల కావాల్సిన స‌మంత 'శాకుంతలం', విశ్వక్ సేన్ 'ధమ్కీ' సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో 'విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌'తో పాటు ధ‌నుష్ న‌టించిన 'సార్' చిత్రం మాత్ర‌మే ప్రధానంగా పోటీప‌డుతున్నాయి. అది ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

తక్కువ సమయంలోనే మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం వరుస సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు. దాంతో తాజా చిత్రంపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పోస్టర్స్, టీజ‌ర్, ట్రైలర్ అన్నీ బాగా ఆకట్టుకుని సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో అక్కినేని అఖిల్ పాల్గొంటున్నాడు. అక్కినేని అఖిల్ ప్రీరిలీజ్ వేడుక‌కు రావ‌డం వ‌ల్ల ఈ చిత్రానికి ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది? ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌కు అక్కినేని అఖిల్ రాక ఏమాత్రం ప్ల‌స్ కానుంది? అనే విష‌యంలో ప‌లువురు ప‌లు ర‌కాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. స‌రైన హిట్ లేకపోయినా అక్కినేని అఖిల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న కుటుంబాన్ని అభిమానించే ప్రేక్ష‌కులు ఎంద‌రో ఉన్నారు. దాంతో వారందరి ప్రోత్సాహం ఈ చిత్రానికి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మురళి శర్మ కీలకపాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్స్ లో బన్నీ వాసు నిర్మించారు. ఒకవైపు శాకుంతలం, ధ‌మ్కీ వాయిదా పడడం, మ‌రోవైపు ప్రీరిలీజ్ వేడుక‌కు అఖిల్ రావ‌డం ఈ సినిమాకు కలిసొస్తుందని చెప్పాలి. మరి దాన్ని ఈ చిత్రం ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో వేచి చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.