English | Telugu

అప్పుడే 40 అంటే నమ్మకంగా లేదు నయనతార

దక్షిణ భారతీయ చిత్ర సీమలో ఉన్న టాప్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. అందానికి అందం,అభినయనానికి అభినయం ఆమె సొంతం. సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ల సినీ కెరీర్ తక్కువ అనే ఒక నిజాన్ని అబద్దంగా మార్చింది నయనతారనే. ఈ రోజు తన సినిమా కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలని ఎదుర్కొని లేడీ సూపర్ స్టార్ గా అవతరించిన నయనతార పుట్టిన రోజు. 39 సంవత్సరాలని పూర్తిచేసుకొని 40 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.

2003 లో వచ్చిన మనస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో నయనతార సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమాలో గౌరీ అనే పాత్రలో చక్కగా నటించి మొదటి సినిమాతోనే ఎంతో భవిష్యత్త్తు ఉన్న హీరోయిన్ అని అనిపించుకుంది.ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి చేసిన చంద్రముఖి చిత్రం నయనతార గురించి అన్ని బాషల ప్రజలకి తెలిసేలా చేసింది. ఆ సినిమాలోని నయన తార అందానికి నటనకి మైమర్చిపోని ప్రేక్షకుడు లేడు. ఆ తర్వాత వచ్చిన గజినీ, విక్టరీ వెంకటేష్ తో చేసిన లక్ష్మి ,విజయ్ తో చేసిన శివకాశి,అజిత్ బిల్లా, ఎన్టీఆర్ అదుర్స్ లాంటి సినిమాలు ఆమెకి మంచి గుర్తింపుని ఇచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమె చేసిన చాలా చిత్రాలు పరాజయం చెందాయి.దాంతో చాలామంది ఇక అందరి హీరోయిన్ లు లాగానే నయనతర కూడా ఇక ఇంటికి వెళ్లడమే అని అనుకున్నారు.

కానీ బాలకృష్ణ తో చేసిన సింహ సినిమాతో నయనతార ప్రభంజనం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇలా భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక స్టార్ డం ని నయన్ సంపాదించుకుంది. బాపు గారు అంతటి వ్యక్తి శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నయనతర కాకుండా ఇంక ఎవరు చేసిన సూట్ అవ్వరు అన్నారంటే నయన్ నటనకి ఉన్న వాల్యూ ని అర్ధం చేసుకోవచ్చు. రాజా రాణి, ఆరంభం, కృష్ణం వందే జగద్గురుం,తన్ని ఒరువన్, మాయ,తిరునాల్, బాబు బంగారం,డోరా,విశ్వాసం ,జై సింహ, సైరా నరసింహారెడ్డి, బిగిల్ ,దర్బార్ ,గాడ్ ఫాదర్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుని పొందింది. తాజాగా పాన్ ఇండియా లెవల్లో షారుక్ తో జవాన్ మూవీ చేసి తన సత్తాని చాటింది .త్వరలో అన్నపూర్ణి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అసలు ఒక బాషలోనే నటించడానికి హీరోయిన్ లకి అవకాశాలు దొరకని సినిమా ఇండస్ట్రీ లో నయన్ 20 సంవత్సరాల నుంచి తన హవా ని కొనసాగిస్తుందంటే నిజంగా గ్రేట్. నయనతర భర్త ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్. ఇరువురికి ఇద్దరు మగ పిల్లలు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.