English | Telugu

చిరంజీవి మెగాస్టార్ ఎలా అయ్యారో తెలుసంటున్న నాని 

నాచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీ గా ఉన్నాడు. పలు ఛానల్స్ కి వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్న నాని తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

నానితో ఒక విలేకరి మీ గత చిత్రం దసరా ఫుల్ మాస్ మూవీ. ఇప్పుడు మీరు చేస్తున్న హాయ్ నాన్న ఫుల్ క్లాస్ మూవీ. మీరు ఈ సినిమానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడిగాడు. దీంతో నాని చిరంజీవి గారు ఖైదీ లాంటి మాస్ సినిమా చేసిన తర్వాత మళ్ళీ అలాంటి మాస్ సినిమాలే చెయ్యలేదుగా అఫ్ కోర్స్ మాస్ సినిమాలకి చిరు గారు పెట్టింది పేరు కానీ ఆయన అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేసారు కదా అని చెప్పాడు. అలా చెయ్యబట్టే ఆయన అన్ని వర్గాల వారికి అభిమాన కధానాయకుడుగా మారారు. అందుకే ఆయన సినీ ప్రయాణం చాలా గొప్పగా సాగి మెగాస్టార్ అయ్యారని నాని చెప్పాడు. పైగా నా అభిమానులు కూడా నా నుంచి ఒక జోనర్ లోనే సినిమాలు వస్తాయని కూడా ఫిక్స్ అవ్వలేదని చెప్పాడు. ఇదంతా చిరంజీవి గారితో నన్ను నేను పోల్చుకొని చెప్పడం లేదు. కేవలం ఒక ఉదాహరణగా చెప్పానంతే అని కూడా నాని అన్నాడు.

పైగా తన సినీ జర్నీ గురించి కూడా నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. నా సినీ కెరీర్ మొత్తం మీద నేను ఎప్పుడు కూడా పెద్ద స్టార్‌ని అవ్వాలని కోరుకోలేదు. తెర మీద నేను పోషించిన పాత్రలని ప్రేక్షకులు తమ జీవితాంతం గుర్తుంచుకుంటే చాలు. అలాగే ఆ చిత్రాలు నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలుగా కూడా మిగిలిపోవాలి అని నాని తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.