English | Telugu

పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చింది కేటీఆర్ ని కాపాడటం కోసమే

ప్రకాష్ రాజ్(prakash raj)గత కొన్నిరోజుల నుంచి పవన్ కళ్యాణ్(pawan kalyan)పై విమర్శలు గుప్పిస్తున్న విషయం అందరకి తెలిసిందే. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఒక రాజకీయ మీటింగ్ లో తీవ్ర ఆరోపణలు కూడా చేసాడు. పవన్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నా అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ మీద తిట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. సినిమా పరిశ్రమకి చెందిన కొంత మంది అయితే ప్రకాష్ రాజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చెయ్యాలని కూడా అంటున్నారు.

రీసెంట్ గా ప్రకాష్ రాజ్ పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్(natti kumar)కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. మీడియా మొత్తం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, కొండా సురేఖ మధ్య నడుస్తున్న ఇష్యూ మీద ఫోకస్ చేసింది.ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.దాంతో ప్రకాష్ రాజ్ ఆ ఇష్యు ని డైవర్ట్ చెయ్యడం కోసమే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసాడు. గత వైసిపీ, బిఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఏనాడూ ఎలాంటి సమస్య మీద ప్రకాష్ రాజ్ స్పందించలేదు.

వైసిపీ ప్రభుత్వం సినిమా టికెట్ ని ఐదు రూపాయలు చేసినపుడు, చిరంజీవిని అవమానించినప్పుడు మాట్లాడలేదు. గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నపుడు ఏ రోజైనా ఇండస్ట్రీ గురించి గాని ప్రజల బాగోగుల గురించి కానీ ఆలోచించని నువ్వు ఇప్పుడు పవన్ ని విమర్శించడం చాలా విడ్డురంగా ఉంది. కనీసం ఎవరకి తిండి కూడా పెట్టలేదని చెప్పుకొచ్చాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.