English | Telugu

నాంపల్లి కోర్టులో నాగార్జున.. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి!

నేడు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వెళ్లారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువునష్టం కేసులో ఆయన కోర్టుకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి అసత్య ఆరోపణలు చేశారు. తమ కుటుంబ పరువుకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి నాగార్జున కోరారు. నాగార్జున వెంట ఆయన సతీమణి అమల, కుమారుడు నాగ చైతన్య తదితరులు ఉన్నారు.

నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను అందరూ తప్పుబట్టారు. కొండా సురేఖ సైతం క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె చేసినవి దారుణ వ్యాఖ్యలు కావడంతో, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున కోర్టుని ఆశ్రయించారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.