English | Telugu

నానిది కూడా అదే రికార్డు మోత

హిందీలో "బ్యాండ్ బాజా బారాత్" చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో"ఆహా కళ్యాణం" పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని, వాణి కపూర్ జంటగా నటిస్తున్నారు. మాములుగా రీమేక్ సినిమాలు అంటే అందరికి తెలిసిందే. ఒక చోట విజయం సాధించిన చిత్రాన్ని మరో చోట కొత్తగా నిర్మించి విడుదల చేయడం.

అయితే హిందీలో "బ్యాండ్ బాజా బారాత్" విడుదలైన తర్వాత తెలుగులో "జబర్దస్త్" అనే సినిమా వచ్చింది. ఇందులో సిద్ధార్థ్, సమంత జంటగా నటించారు. కానీ ఈ సినిమా "బ్యాండ్ బాజా బారాత్"కు రీమేక్ కాదు. కానీ ఆ సినిమానే రీమేక్ చేసారేమో అనే విధంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే...తెలుగులో వచ్చిన "జబర్దస్త్" చిత్రం మొత్తం కూడా హిందీలో వచ్చిన "బ్యాండ్ బాజా బారాత్" సినిమా లాగే ఉంటుంది. కానీ తెలుగులో "జబర్దస్త్" అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఇదిలా ఉంటే... హిందీ చిత్రానికి రీమేక్ అంటూ తెరకెక్కుతున్న "ఆహా కళ్యాణం" చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదల చేసారు. నిజానికి నాని ఈ రీమేక్ చేస్తున్నాడని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా.. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు. కానీ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూసి, తాము అనుకున్నది కరెక్టే అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఇదివరకే అలాంటి కథతోనే "జబర్దస్త్" చిత్రం వచ్చింది. మరి నాని కూడా మళ్ళీ అదే సినిమా చేస్తే ఫ్లాప్ కాకపోతే ఏం అవుతుంది.

జనాలు కూడా ఒకే సినిమాను ఎన్ని సార్లు చూస్తారు చెప్పండి. అరిగిపోయిన రికార్డులాగా అదే సినిమాను మళ్ళీ మళ్ళీ చూపిస్తే జనాలు ఇక అలాంటి సినిమాలను చూడటం మాట పక్కనపెడితే.. అసలు ఆ సినిమా గురించి పట్టించుకునే వారే కరువవుతారు. మరి ఇప్పటికైనా నాని ఇలాంటి అరిగిపోయిన రికార్డుల సినిమాలు కాకుండా కొంచెం కొత్తగా సినిమాల గురించి అయిన ఆలోచిస్తే బాగుంటుంది

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.