English | Telugu

కళ్యాణ్ రామ్ సంచలన నిర్ణయం.. బాలయ్యా ఎన్టీఆరా?

సినిమాకి ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. అందుకే మేకర్స్ రిలీజ్ డేట్ ని ముందే ప్రకటించేసి.. విడుదలకు నెలా రెండు నెలల ముందు నుంచే విపరీతంగా ప్రమోషన్స్ చేస్తుంటారు. అలాంటిది నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మాత్రం.. కేవలం రెండు వారాల ముందు విడుదల తేదీని ప్రకటించి షాకిచ్చాడు. (Nandamuri Kalyan Ram)

కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. తల్లీకొడుకుల కథలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వైజయంతిగా విజయశాంతి, అర్జున్ గా కళ్యాణ్ రామ్ అలరించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మే లేదా జూన్ లో విడుదలయ్యే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. (Arjun Son Of Vyjayanthi)

సరిగ్గా విడుదలకు రెండు వారాలే సమయముంది. ఈ రెండు వారాల్లో సినిమాని ప్రమోట్ చేసి, భారీ హైప్ తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. అలాంటిది కళ్యాణ్ రామ్.. తన కొత్త సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నందమూరి అభిమానులు కూడా ఇలా సడెన్ గా విడుదల తేదీని ప్రకటించడంతో షాక్ అవుతున్నారు.

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'పై ఒక్కసారిగా హైప్ వచ్చేలా చేయాలంటే.. అదిరిపోయే ట్రైలర్ ను రిలీజ్ చేయాలి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాలకృష్ణ లేదా జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలి. కళ్యాణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడం అనేది కొన్నేళ్లుగా కామన్ అయిపోయింది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ నటించిన పలు సినిమాల ఈవెంట్స్ కి గెస్ట్ గా వచ్చాడు. అన్న అడగాలి కానీ, 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ వస్తాడు అనడంలో డౌట్ లేదు. (Jr NTR)

అయితే 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఈవెంట్ కి ఎన్టీఆర్ కి బదులుగా బాలకృష్ణ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. బాబాయ్ బాలయ్యను కళ్యాణ్ రామ్ ఎంతగానో అభిమానిస్తుంటాడు. పైగా, బాలకృష్ణ-విజయశాంతి ది అప్పట్లో హిట్ పెయిర్. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్యను తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచనలో కళ్యాణ్ రామ్ ఉన్నాడట. (Balakrishna)

మరి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఈవెంట్ కి బాలయ్య వస్తాడో లేక ఎన్టీఆర్ వస్తాడో చూడాలి. లేదంటే, ఇద్దరూ వచ్చి బిగ్ సర్ ప్రైజ్ ఇస్తారేమో చూడాలి. అదే జరిగితే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.