English | Telugu

కృష్ణంరాజు బాటలోనే ప్రభాస్‌.. ఆ విషయంలో పబ్లిసిటీ అవసరం లేదు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు కుటుంబానికి ఓ విశిష్ట స్థానం ఉంది. విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన ఈ కుటుంబం పేదల పట్ల వ్యవహరించే తీరు గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మనకు తెలుసు. ముఖ్యంగా కృష్ణంరాజు ఈ విషయంలో తనకంటూ ప్రత్యేకమైన అభిప్రాయాలు, ఆశయాలు ఏర్పరుచుకున్నారు. తమ సినిమా సహచరుల పట్ల వ్యవహరించే తీరుగానీ, సాయాన్ని కోరి వచ్చే వారి పట్ల చూపించే ఆదరాభిమానాలుగానీ మరే ఇతర హీరోలకు సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. కృష్ణంరాజు జీవించి ఉన్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కానీ, దానికి ఎలాంటి ప్రచారం చేసుకునేవారు కాదు. ఆయన జీవితంలో అలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలనుకున్నారు. కానీ, అవి నెరవేరకముందే ఆయన కన్నుమూశారు. ఇప్పుడు ఆ బాధ్యతను ఆయన నట వారసుడు ప్రభాస్‌ తీసుకున్నారు. ఒక్కొక్కటిగా పెదనాన్న కన్న కలలను నెరవేర్చే పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఇప్పటికే ప్రభాస్‌ చేత సాయం పొందినవారు వేలల్లో ఉన్నారు. కానీ, ఏరోజూ తాను చేసిన సాయం గురించి ఎక్కడా ప్రస్తావించరు. తను చేసిన సేవా కార్యక్రమాల గురించి పదిమందికీ తెలియాలని కోరుకోరు. కృష్ణంరాజుకి తీరని కల ఒకటి ఉంది. ఆధునిక వసతులతో కూడిన ఒక హాస్పిటల్‌ను నిర్మించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనేదే ఆయన కోరిక. దాన్ని సాకారం చేసేందుకు ప్రభాస్‌ సిద్ధమవుతున్నారు. అతని సహకారంతో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఓ హాస్పిటల్‌ను నిర్మించబోతున్నారు. ఆ హాస్పిటల్‌ వివరాలను ఆమె తెలియజేస్తూ ‘దేశంలో అందర్నీ వేధిస్తున్న ఆరోగ్య సమస్య మధుమేహం. దాని వల్ల అవయవాలు కోల్పోయిన వారిని చూసి కృష్ణంరాజుగారు, ప్రభాస్‌ ఎంతో చలించిపోయేవారు. అలాంటి వారికి ఉచితంగా వైద్యం అందించేందుకు ఒక హాస్పిటల్‌ నిర్మించాలన్నది ఆయన కల. ఆయన అభిమాని డాక్టర్‌ వేణు కవతప్‌తోపాటు 20 మంది అపోలో వైద్యుల బృందం ఆధ్వర్యంలో భీమవరం చుట్టు పక్కల ఉన్న షుగర్‌ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే రెండు సార్లు హెల్త్‌ క్యాంపులు నిర్వహించాం. ఈ విషయంలో ప్రభాస్‌ తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఒక హాస్పిటల్‌ను నిర్మించాలని తలపెట్టాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఆధునిక సౌకర్యాలతో ఈ హాస్పిటల్‌ను నిర్మిస్తాం. ఇది కూడా ప్రభాస్‌ సాయంతోనే జరుగుతుంది’ అన్నారు.

ఇప్పటివరకు వివిధ సందర్భాల్లో ప్రభాస్‌ చేసిన సాయం గురించి అందరికీ తెలుసు. దేశంలో జరిగిన అనేక విపత్తుల్లో నేనున్నానంటూ సాయం చేయడంలో ప్రభాస్‌ ఎప్పుడూ ముందుంటారు. కరోనా సమయంలో రూ.3 కోట్లు ప్రధాన మంత్రి సహాయ నిధికి, రూ.1 కోటి రెండు తెలుగు రాష్ట్రాలకు, రూ.50 లక్షలు చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కి.. మొత్తం నాలుగున్నర కోట్లు సాయాన్ని అందించారు ప్రభాస్‌. అంతేకాదు, ప్రతి ఏటా 100 మంది విద్యార్థులకు ఫీజులతో సహా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. గత ఏడాది వరదలు సంభవించినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.2 కోట్లు సాయాన్ని అందించారు. ఇన్ని రకాలుగా ప్రజలకు సాయం చేస్తున్నప్పటికీ ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకోని వ్యక్తి ప్రభాస్‌. సినీ పరిశ్రమలోని ఎంతో మంది సంపాదన వందల కోట్లలో ఉంటుంది. కానీ, పేదవారికి సాయం చేయాలనే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో మొదటి వరసలో నిలిచే వ్యక్తి రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఒక్కరే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.