English | Telugu

నాన్నకు నేనంటే బోరేమో - నాగార్జున

సాదా సీదాగా సినిమా తీసినా పబ్లిసిటీ మాత్రం తెలివిగా చేసుకోవాలి. దీనికి ఎవరి సినిమాలు మినహాయింపు కావు. అందుకే హీరో నాగార్జున ‘మనం’సినిమా పబ్లిసిటి చాల వెరైటీగా చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన తండ్రీ అక్కినేని గురించి ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఏఎన్ఆర్ తమని స్నేహితులులా చూసుకునేవారని, ఆయన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక స్నేహితుడుని అడిగినట్లు డ్రింక్ చేస్తావా అని అరమరికలు లేకుండా అడిగేవారని తన తండ్రి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు నాగార్జున. మనం సినిమా షూటింగ్ విశేషాలు వివరిస్తూ, తండ్రితో నటించినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి వీలు కలిగిందన్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ లో అక్కినేని తన గురించి ఏమాత్రం పట్టించు కోకుండా తన ద్రుష్టి అంతా నాగచైతన్య పైనే పెట్టి సలహాలు ఇచ్చే వారని, అది చూసి తనకు కొంత ఉక్రోషంగా అనిపించేదన్నారు. ఆ విషయం తండ్రిని అడుగుదామని అనుకొని అడగలేక పోయానన్నారు. అలాగే తండ్రికి తనంటే బోర్ కొట్టి ఉండవచ్చునేమోనని చెప్పుకొచ్చారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. సినిమా విడుదల కోసం అసంఖ్యాక ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.