English | Telugu

టికెట్ రేట్ 200 దాటకూడదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం 

ప్రస్తుత రోజుల్లో ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే టికెట్ రేట్లు చాలా హైగా ఉంటున్నాయి. మల్టిప్లెక్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. వేలకి వేలు ఖర్చవుతున్నాయి. దీంతో చాలా ఫ్యామిలీస్ సినిమాకి దూరం అవుతు వస్తున్నాయి.

దీంతో కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt)సినిమా టికెట్ గరిష్ట ధర సింగల్ స్క్రీన్ థియేటర్,మల్టిప్లెక్స్ థియేటర్ అయినా 200 రూపాయిలకి మించి ఉండకూడదని ముసాయిదా నోటిఫికేషన్ ని జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తు ప్రజలందరికి సినిమా చేరువ కావాలి. టికెట్ దరల భారంతో సామాన్యులు వెనకడుగు వేయడం మానిపించాలి. కొన్ని మల్టిప్లెక్స్ లో టికెట్ రేట్స్ 500 నుంచి 1000 దాకా ఉన్నాయంటూ కూడా తన ప్రకటనలో తెలిపింది. ఇక కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ పై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజులుగా చెప్పవచ్చు.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .