English | Telugu

హైదరాబాద్ లో మనీ మనీ మోర్ మనీ

హైదరాబాద్ లో "మనీ మనీ మోర్ మనీ" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వివరాల్లోకి వెళితే సింహపురి టాకీస్ పతాకంపై, జె.డి.చక్రవర్తి, బ్రహ్మానందం ప్రథాన పాత్రల్లో నటిస్తూండగా, జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో,రఘునాథ్, నరేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం " మనీ మనీ మోర్ మనీ". "మనీ మనీ మోర్ మనీ" సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, నరసింహ, గజాలా, ఆశాసైనీ (మయూరి) తదితరులు నటిస్తున్నారు.

"మనీ" చిత్రానికి "మనీ మనీ" చిత్రం సీక్వెల్ అయితే, "మనీ మనీ మోర్ మనీ" చిత్రం "మనీ మనీ" చిత్రానికి సీక్వెల్ గా నిర్మిస్తున్నారు. "మనీ మనీ మోర్ మనీ" పూర్తి వినోదాత్మక హాస్యరసభరిత చిత్రంగా నిర్మించబడుతోంది. "మనీ మనీ మోర్ మనీ" సినిమా షూటింగ్ హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో శరవేగంగా, నిరాటంకంగా జరుగుతోంది. "మనీ మనీ మోర్ మనీ" జూన్ చివరలో కానీ జూలై మొదట్లో కానీ విడుదలయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.