English | Telugu

నా బ్రదర్ తో కలిసి జనవరి 10 న మూవీ చూడబోతున్నాను..మీరు కూడా రెడీనా

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu)ప్రస్తుతం రాజమౌళి(Rajamouli)మూవీకి సంబంధించిన ప్రిపరేషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.ఎటువంటి హడావిడి లేకుండా జనవరి 2 న పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యిన ssmb 29 అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది.బాహుబలి సిరీస్ తో పాటు ఆర్ ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలకి కథని అందించిన విజయేంద్రప్రసాద్ కథని అందిస్తుండటంతో మూవీపై మహేష్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మహేష్ రీసెంట్ గా వర్సటైల్ యాక్టర్ సోనుసూద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫతేహ్' అనే సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసాడు.అనంతరం 'ఎక్స్' వేదికగా స్పందిస్తు యాక్షన్ ప్యాక్డ్ గా సిద్దమైన ఈ మూవీ ట్రైలర్ చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది.నా స్నేహితుడు సోనుసూద్ కి ఆల్ ది బెస్ట్.ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని వెండి తెరపై వీక్షించాలని కోరుకుంటున్నాను.సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందంటూ 'ఎక్స్' వేదికగా తెలిపాడు.

సోనుసూద్(sonu sood)కూడా రిప్లై ఇస్తు 'లవ్ యు బ్రదర్ మనిద్దరం కలిసి సినిమా చూద్దామని చెప్పుకొచ్చాడు.సోనుసూద్, మహేష్ లు కలిసి దూకుడు,ఆగడు వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు.ఇక 'ఫతేహ్' మూవీ సైబర్ మాఫియా ఆధారంగా తెరకెక్కగా జాక్వలిస్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా చేస్తుంది.విజయ్ రాజ్,నసీరుద్దీన్ షా,భట్టాచార్య వంటి మేటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.జనవరి 10 న మూవీ విడుదల కానుంది

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.