English | Telugu

శ్రీతేజ్ ని పరామర్శించిన అల్లు అర్జున్..కిమ్స్ ఎండి తో చర్చలు 

పుష్ప 2(Pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్(sritej)తీవ్ర గాయాలపాలయిన విషయం తెలిసిందే. 34 రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్ లోనే శ్రీ తేజ్ చికిత్స తీసుకుంటుండగా రోజు రోజుకి బాబు కోలుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్(Allu arjun)ఈ రోజు ఉదయం 10 గంటలకి కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజ్ ని పరామర్శించడం జరిగింది.దాదాపుగా 15 నిముషాలు హాస్పిటల్ లో శ్రీ తేజ్ వద్దే ఉన్న అల్లు అర్జున్ బాబు ఆరోగ్యం గురించి డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నాడు.కిమ్స్ ఎండి బొడ్డు భాస్కరరావు తో కూడా శ్రీ తేజ్ హెల్త్ విషయం గురించి చర్చించడం జరిగింది.శ్రీ తేజ్ పూర్తి ఆరోగ్యంగా ఉండేదాకా తనదే బాధ్యత అని కూడా తెలిపినట్టుగా సమాచారం.అల్లు అర్జున్ ఇన్ని రోజులు శ్రీ తేజ్ ని కలవాలని అనుకున్నా కూడా తన మీద నమోదయిన కేసు దృష్ట్యా కలవలేకపోయాడు.కానీ ఇటీవలే నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో శ్రీ తేజ్ ని పరామర్శించాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో కిమ్స్ హాస్పిటల్ ఏరియాకి చెందిన రామ్ గోపాల్ పేట నోటీసులు శ్రీ తేజ్ ని కలవాలంటే మాకు ముందుగా ఇన్ ఫర్మేషన్ ఇవ్వాలని నోటీసులు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కిమ్స్ కి రావడం జరిగింది.అల్లు అర్జున్ వెంట దిల్ రాజు(Dil raju)కూడా కిమ్స్ హాస్పిటల్ కి వచ్చాడు.ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్(Allu Aravind)కూడా కొన్ని రోజుల క్రితం శ్రీ తేజ్ ని పరామర్శించిన విషయం తెలిసిందే.ఇక సంధ్య థియేటర్ ఘటనలోనే శ్రీ తేజ్ తల్లి రేవతి చనిపోగా అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 టీం 3 కోట్లరూపాయలని ఇచ్చారు.రేవతి భర్తకి ఫిలిం ఇండస్ట్రీ లోనే పర్మినెంట్ జాబ్ కూడా రానుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.