English | Telugu

ఏమి చేతురా ‘లింగా’

రజనీకాంత్ సినిమా ‘లింగా’కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ సినిమా మొదలెట్టినప్పట్నించీ ఏదో ఒక కిరికిరి. ‘లింగా’ సినిమాని కొట్టేసిన కథతో రూపొందిస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. అప్పుడెప్పుడో తమిళంలో రూపొందిన ఒక సినిమా కథని అటూ ఇటూ తిప్పి ‘లింగా’ని రూపొందిస్తున్నారని తమిళ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాత సినిమా సదరు కథా రచయిత రవిరత్నం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ సినిమాని తామెంతో చెమటోడ్చి తయారు చేసిన సొంత కథతోనే తీస్తున్నామని, కోర్టులో కేసు నిలబడదని సినిమా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, కథానాయకుడు రజనీకాంత్ కూడా చెప్పారు. అయితే మనం ఒకటి తలిస్తే కోర్టు ఒకటి తలచిందన్నట్టుగా, ఈ సినిమా విడుదలకు రెడీ అయిన టైమ్‌లో కోర్టు షాకిచ్చింది. ఈ కేసు నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం లోపు కోర్టుకు 10 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశింది. శుక్రవారే ప్రపంచవ్యాప్తంగా ‘లింగా’ విడుదలవుతోంది. ‘లింగా’ విడుదలైన తర్వాత ఇది కాపీ కథతో తీసిన సినిమా అని తేలితే ఆ పది కోట్లూ ఆటోమేటిగ్గా రైటర్‌కి వెళ్ళిపోతాయి. శుక్రవారం సినిమా విడుదల అనగా కోర్టు ఇలా ఆదేశించడంతో నిర్మాత కిక్కురుమనకుండా ఏమి చేతురా లింగా అనుకుంటూ పదికోట్లు కోర్టులో డిపాజిట్ చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అయినా కాపీ కథతో తీసి కక్కూర్తి పడేబదులు ఆ రైటర్ మొహాన ముందే ఓ కోటో రెండు కోట్లో పడేస్తే ఇప్పుడు పది కోట్లకి బ్యాండు పడేది కాదు కదా... ఏంటో.. ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతే!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.