English | Telugu

విజయ్ పొలిటిక‌ల్ ఎంట్రీపై లోకేష్ ఫోకస్!

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన సినిమా లియో. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్ స‌ర‌స‌న ఈ సినిమాలో త్రిష న‌టించారు. అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు జ‌నాలు. లియోకి అంత పెద్ద క్రేజ్ ఉంది జ‌నాల్లో. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌ని చెన్నైలో చేద్దామ‌ని అనుకున్నారు. ద‌ళ‌ప‌తి పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి ఇప్పుడు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఈ టైమ్‌లో చెన్నైలో ఈవెంట్ చేసి, జ‌నాల‌ను అదుపు చేయ‌లేక‌పోతే, ద‌ళ‌ప‌తి పొలిటిక‌ల్ కెరీర్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అందులోనూ నెగ‌టివ్ ఇంపాక్ట్ ఇప్పుడు అవ‌స‌ర‌మా అన్న‌ది ద‌ళ‌ప‌తి వ‌ర్గాల్లో వినిపించిన మాట‌. మొన్నామ‌ధ్య ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈవెంట్ స‌రిగా ఆర్గ‌నైజ్ చేయ‌లేక‌పోవ‌డంతో విప‌రీతంగా విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. తాను అలాంటి విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. అందుకే లియోకి సంబంధించిన చెన్నై ఈవెంట్‌ని లాస్ట్ మినిట్‌లో కేన్సిల్ చేయించారు.

ఇప్పుడు సినిమాకు ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ఇంపార్టెంట్‌. ఈ టైమ్‌లో అస‌లు ఈవెంటే చేయ‌క‌పోయినా ఇబ్బందే. అందుకే కాస్త వెరైటీగా ఈ సారి లియో ఈవెంట్‌ని హైద‌రాబాద్‌లో అద్భుతంగా ప్లాన్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు మేక‌ర్స్. ఈ కార్య‌క్ర‌మంలో లోకేష్ క‌న‌గ‌రాజ్‌, అనిరుద్ రవిచంద్ర‌న్‌తో పాటు అంద‌రూ పాల్గొంటార‌ట‌. ఈ వేడుక మీద అనిరుద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ చేయ‌డానికి కూడా రెడీగా ఉన్న‌ట్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

సంజ‌య్ ద‌త్‌, అర్జున్ స‌ర్జా, మిస్కిన్‌, గౌత‌మ్ మీన‌న్‌, ప్రియా ఆనంద్‌, శాంతి మాయాదేవి, మాథ్యూ థామ‌స్‌, మ‌న్సూర్ అలీ ఖాన్ తోపాటు ప‌లువురు ఈసినిమాలో న‌టించారు. ఈ సినిమాలో ఐదు పాట‌లున్నాయి. ఇంకో రెండు పాట‌ల‌ను విడుద‌ల చేయాల్సి ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.