English | Telugu

భగవంత్ కేసరి ప్రభంజనం.. 2 గంటల 35 నిమిషాలు

యువరత్న నందమూరి బాలకృష్ణ అమ్ముల పొదిలో నుంచి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా మీద నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమా మీద వాళ్ళ అంచనాలని రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ సినిమా నిడివికి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

బాలయ్య సినిమా వస్తుందంటే చాలు ఆ ముందు రోజు రాత్రి నుంచే థియేటర్స్ దగ్గర అభిమానుల హంగామా మొదలవుతుంది. అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలవుతాయి. వెండి తెర మీద బాలయ్య నటవిశ్వరూపం చూసి అభిమానులు ఆనందం తో పులకరించిపోతారు. ఇప్ప్పుడు వాళ్ళ ఆనందం రెట్టింపు అయ్యేల భగవంత్ కేసరి మూవీ యొక్క నిడివి రెండు గంటల 35 నిమిషాలు ఉండబోతుంది. దీంతో తెర మీద బాలయ్య విశ్వరూపాన్ని అభిమానులు మరింత ఎక్కువగా వీక్షించవచ్చని తెలుస్తుంది.
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శత్వం లో తెరకెక్కతున్న ఈ మూవీ ని 155 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అంటే సుమారు 2 గంటల 35 నిమిషాలు పాటు భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనుంది. థమన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమా లోని పాటలన్ని సూపర్ డూపర్ హిట్ గా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగిపోతున్నాయి. కాజల్ ,శ్రీ లీల,అర్జున్ రామ్ పాల్ ,శరత్ కుమార్ తదితరులు నటిస్తున్న భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా ఈ నెల 19 న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. షైన్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై సాహు గారపాటి హరీష్ పెద్ది లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.