English | Telugu

శ్రీదేవి రెండో కుమార్తె  కోలీవుడ్ ఎంట్రీ

సౌత్‌తో పాటు నార్త్‌లోనూ అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన దివంగ‌త అందాల తార శ్రీదేవి. ఇప్పుడు ఆమె కుమార్తె జాన్వీ క‌పూర్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టించిన జాన్వీ.. 'దేవ‌ర' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వ‌బోతున్నారు. ఇప్పుడు శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి క‌పూర్ కూడా సినీ రంగ ప్ర‌వేశానికి రంగం సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న సినిమా ద్వారా ఖుషి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ సౌత్ ఎంట్రీ ఇవ్వ‌టానికి చాలా స‌మ‌యాన్నే తీసుకున్నప్ప‌టికీ ఖుషి క‌పూర్ మాత్రం ఎక్కువ స‌మయం తీసుకోలేదు. అథ‌ర్వ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాను ఆకాష్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌బోతున్నారు.

సీనియ‌ర్ దివంగ‌త త‌మిళ న‌టుడు ముర‌ళి త‌న‌యుడైన అథ‌ర్వ త‌మిళంలో సుప‌రిచిత న‌టుడే. తెలుగులోనూ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రంలో న‌టించి మెప్పించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాకు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌నున్నారు. అలాగే సినిమా అంత‌టినీ అమెరికాలో చిత్రీక‌రిస్తార‌ని స‌మాచారం. అథ‌ర్వ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీ అని సినీ స‌ర్కిల్స్ అంటున్నాయి. అర్చీస్ అనే బాలీవుడ్ సినిమాలో ఖుషి ఇప్ప‌టికే న‌టించింది. జోయా అక్త‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అమ్మ‌డు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోంది. మ‌రో వైపు త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ల‌వ్ టుడే హిందీ రీమేక్‌లోనూ ఈమె క‌థానాయిక‌గా న‌టించింది.

ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే కోలీవుడ్ సినిమాల‌తో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది ఖుషి క‌పూర్‌. బోనీ సైతం ఈ మ‌ధ్య సౌత్ సినిమాల‌తో అనుబంధం పెంచుకున్నారు. త‌మిళంలో వ‌ళిమై, తునివు చిత్రాల‌కు నిర్మాత‌గా .. తెలుగులో వ‌కీల్ సాబ్ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు మ‌రి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .