English | Telugu

'పటాస్'ను దక్కించుకున్న దిల్ రాజు

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత దిల్ రాజు కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా హక్కులను ఆంధ్రా, నై జాం ఏరియాలలో సొంతం చేసుకున్నాడు. అంతేకాక వైజాగ్, కృష్ణ మరియు నైజాం ప్రాంతాలలో ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేయనున్నాడు. ఈ ‘పటాస్’ సినిమా డిసెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేసినా నందమూరి జానకిరామ్ అకాల మరణం వలన వాయిదాపడింది. ప్రస్తుతం ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్ కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.